ముంబైకి షిఫ్ట్ అవుతున్న పూరి జగన్నాథ్

టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన తన తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారట.. ముంబైలోని జుహులో వచ్చే ఆరునెలలు ఉండడానికి రెడీ అయిపోతున్నారట. పూరి జగన్నాథ్ టీం ఇప్పటికే ముంబైకి చేరుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు పూరి కూడా దేశ ఆర్థిక రాజధానికి చేరుకుంటున్నారట.. ఇదంతా ఆయన త్వరలోనే తీయబోయే ‘ఫైటర్’ చిత్రంకోసం అని తెలిసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కరణ్ జోహర్ నిర్మాణంలో ఓ భారీ సినిమా […]

Advertisement
Update: 2019-12-30 04:30 GMT

టాలీవుడ్ సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన తన తట్టాబుట్టా సర్దేసుకుంటున్నారట.. ముంబైలోని జుహులో వచ్చే ఆరునెలలు ఉండడానికి రెడీ అయిపోతున్నారట.

పూరి జగన్నాథ్ టీం ఇప్పటికే ముంబైకి చేరుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు పూరి కూడా దేశ ఆర్థిక రాజధానికి చేరుకుంటున్నారట.. ఇదంతా ఆయన త్వరలోనే తీయబోయే ‘ఫైటర్’ చిత్రంకోసం అని తెలిసింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కరణ్ జోహర్ నిర్మాణంలో ఓ భారీ సినిమా తీస్తున్నారు. బాక్సింగ్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందట.. ఈ కథ మొత్తం ముంబై కేంద్రంగానే సాగుతుందట.. దాదాపు 80శాతం షూటింగ్ ముంబై నగరంలో జరుగుతుందని తెలిసింది. కరణ్ జోహార్ బృందం ముంబైలో పూరి జగన్నాథ్ కు సహాయ సహకారాలు అందిస్తుందట.

వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ చేస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదీ. ఈ భారీ బడ్జెట్ చిత్రం హిందీలో హిట్ అయితే విజయ్ ఓవర్ నైట్ నేషనల్ హీరో అయిపోతాడు. అంతేకాకుండా ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలో కూడా విడుదలకు పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News