జగన్‌ పాలన అద్భుతంగా ఉంది... ఇంగ్లీష్‌ విద్య అవసరం " సచ్చిదానందస్వామి

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి. పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో గణపతి సచ్చిదానందస్వామి అతిరుద్ర యాగం నిర్వహించారు. లోక కల్యాణం, ప్రజా సంక్షేమం కోసమే అతిరుద్రయాగం చేసినట్టు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌ పాలన అద్భుతంగా ఉందన్నారు. వారసత్వ అర్చకత్వంపై సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా జగన్‌ పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. ఏపీ […]

Advertisement
Update: 2019-11-23 08:58 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన అద్భుతంగా ఉందని అభిప్రాయపడ్డారు దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి.

పవిత్ర పుణ్యక్షేత్రం కాశీలో గణపతి సచ్చిదానందస్వామి అతిరుద్ర యాగం నిర్వహించారు. లోక కల్యాణం, ప్రజా సంక్షేమం కోసమే అతిరుద్రయాగం చేసినట్టు వివరించారు. హిందూ ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని వ్యాఖ్యానించారు.

ఏపీలో జగన్‌ పాలన అద్భుతంగా ఉందన్నారు. వారసత్వ అర్చకత్వంపై సీఎం జగన్‌ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చే దిశగా జగన్‌ పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు.

ఏపీ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న ఆలోచనను ఆయన స్వాగతించారు. ఇంగ్లీష్ విద్య విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని… ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తాను అభినందిస్తున్నట్టు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News