ఒకే కారులో సుజనా, వంశీ షికారు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి… సైకిల్‌పై మాత్రం ప్రేమ చంపుకోలేకపోతున్నారు. టీడీపీకి- బీజేపీకి మధ్య సుజనాచౌదరి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. బీజేపీ ఒరిజినల్ నేతలకు భిన్నంగా టీడీపీ నేత తరహాలోనే ఇటీవల సుజనాచౌదరి ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే 2023లోనే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సుజనాచౌదరి చెబుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… సుజనాచౌదరిని కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరు వచ్చిన సుజనాచౌదరి… స్థానిక బీజేపీ నేత ఇంటికి వచ్చారు. దాంతో […]

Advertisement
Update: 2019-10-25 01:46 GMT

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి… సైకిల్‌పై మాత్రం ప్రేమ చంపుకోలేకపోతున్నారు. టీడీపీకి- బీజేపీకి మధ్య సుజనాచౌదరి అనుసంధాన కర్తగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. బీజేపీ ఒరిజినల్ నేతలకు భిన్నంగా టీడీపీ నేత తరహాలోనే ఇటీవల సుజనాచౌదరి ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే 2023లోనే ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ సుజనాచౌదరి చెబుతున్నారు.

తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… సుజనాచౌదరిని కలవడం చర్చనీయాంశమైంది. గుంటూరు వచ్చిన సుజనాచౌదరి… స్థానిక బీజేపీ నేత ఇంటికి వచ్చారు. దాంతో అక్కడికి వచ్చిన వల్లభనేని వంశీ అక్కడే ఎవరికీ కనిపించకుండా కారులోనే కూర్చున్నారు. బీజేపీ నేత ఇంటి నుంచి సుజనా చౌదరి బయటకు రాగానే సుజనాచౌదరి కారులో వల్లభనేని వంశీ ఎక్కి ఇద్దరూ బయటకు వెళ్లారు.

చంద్రబాబు నుంచి సమాచారం సుజనాచౌదరికి చేరవేసేందుకు వంశీ కలిసి ఉంటారని భావిస్తున్నారు. అదే సమయంలో ఇటీవల ఎన్నికల సమయంలో ప్రజలకు వేలాదిగా నకిలీ ఇళ్ల పట్టాలు అందించిన వ్యవహారంలో వల్లభనేని వంశీపై కేసు నమోదు అయింది. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు తాత్కాలికంగా బీజేపీలో చేరేందుకు వంశీ సిద్ధమవుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

Tags:    
Advertisement

Similar News