వాసిరెడ్డి పద్మకు కీలక పదవి.. జీవో జారీ

వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను కీలక పదవి వరించింది. తొలి నుంచి వైసీపీ తరపున గట్టిగా తన వాణి వినిపిస్తూ వచ్చిన వాసిరెడ్డి పద్మ సేవను గుర్తించి ఆమెకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు జగన్‌. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. మొన్నటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని రాజకుమారి ఉండేవారు. ఆమె రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నివేదికను గవర్నర్‌కు […]

Advertisement
Update: 2019-08-08 04:05 GMT

వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మను కీలక పదవి వరించింది. తొలి నుంచి వైసీపీ తరపున గట్టిగా తన వాణి వినిపిస్తూ వచ్చిన వాసిరెడ్డి పద్మ సేవను గుర్తించి ఆమెకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించారు జగన్‌.

ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించారు. ఈమేరకు ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది.

మొన్నటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని రాజకుమారి ఉండేవారు. ఆమె రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నివేదికను గవర్నర్‌కు సమర్పించిన వెంటనే నన్నపనేని రాజకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దాంతో కొత్తగా ఆ పదవిని వాసిరెడ్డి పద్మతో భర్తీ చేశారు.

వాసిరెడ్డి పద్మ… 2011 నుంచి వైసీపీ పక్షాన ఉన్నారు. టీవీ చర్చల్లో వైసీపీ తరపున గట్టిగా వాదించే కొద్దిమంది నేతల్లో వాసిరెడ్డి పద్మ కూడా ఒకరిగా గుర్తింపు పొందారు.

Tags:    
Advertisement

Similar News