జగన్‌కు మద్దతుగా నిలబడుదాం " జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక … వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ ఫించన్‌ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ పాలనను కొనియాడారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సంక్షేమ పథకాలు బాగా అమలు జరగడం వల్ల ప్రజలు ఆయన్ను బాగా అభిమానించారన్నారు. వైఎస్‌ హయాంలో ప్రతి పేదవాడు కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా ఇల్లు కట్టుకున్నారన్నారు. ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఇళ్లు ఇస్తామంటున్నారని … ఇది […]

Advertisement
Update: 2019-07-08 12:10 GMT

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక … వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌ ఫించన్‌ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ పాలనను కొనియాడారు.

వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన సంక్షేమ పథకాలు బాగా అమలు జరగడం వల్ల ప్రజలు ఆయన్ను బాగా అభిమానించారన్నారు. వైఎస్‌ హయాంలో ప్రతి పేదవాడు కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా ఇల్లు కట్టుకున్నారన్నారు.

ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఇళ్లు ఇస్తామంటున్నారని … ఇది సంతోషించదగ్గ పరిణామమన్నారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలందాయని విమర్శించారు. కులాలకు, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తానంటున్న జగన్‌ మోహన్ రెడ్డికి అందరూ మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎవరైతే ఉపయోగపడుతారో వారిని పార్టీలకు అతీతంగా అభినందిచాల్సిందేనన్నారు.

ఇప్పుడు కాసేపు మన జనసేన ఎమ్మెల్యే రాపాక ని తిడదాం…???

Posted by Gopiraj Vanka on Monday, 8 July 2019

Tags:    
Advertisement

Similar News