ఊహించని నిర్ణయం తో షాకిచ్చిన సాయి ధరమ్ తేజ్

కొన్ని సంవత్సరాల పాటు వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే విడుదలైన ‘చిత్రాలహరి’ సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. చాలా కాలం తరువాత మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో తేజ్ పక్కింటబ్బాయి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. […]

Advertisement
Update: 2019-06-19 03:59 GMT

కొన్ని సంవత్సరాల పాటు వరుస డిజాస్టర్ లతో సతమతమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యనే విడుదలైన ‘చిత్రాలహరి’ సినిమాతో ఎట్టకేలకు ఒక మంచి హిట్ ను అందుకున్నాడు.

చాలా కాలం తరువాత మంచి విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో తేజ్ పక్కింటబ్బాయి తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తేజ్ దేవాకట్టా దర్శకత్వంలో ఒక సినిమా ను చేయడానికి సిద్ధం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘ప్రస్థానం’ వంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన దేవాకట్టా ఆ తరువాత మళ్ళీ అలాంటి గొప్ప హిట్ అందుకోలేకపోయారు.

తాజాగా దేవాకట్టా సాయి ధరమ్ తేజ్ కి ఒక మంచి కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఆ కథ తేజ్ కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. కానీ మొన్నటిదాకా ప్లాపులతో సతమతం అయిన సాయి ధరమ్ తేజ్ స్ట్రగ్లింగ్ దర్శకుడు దేవాకట్ట తో సినిమా చేయడమంటే సాహసమనే అనాలి. అందుకే అభిమానులు కూడా తేజ్ నిర్ణయానికి షాక్ అవుతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో తేజ్ తన విన్నింగ్ స్ట్రీక్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News