ఏపీలో ఆశా వర్కర్ల జీతాలు భారీగా పెంపు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేశాక, ఇంకా మంత్రి వర్గం కూడా ఏర్పడక ముందే తాను ఇచ్చిన ఎన్నికల హామీలను వరుసగా నెరవేరుస్తున్నారు. ఆశావర్కర్ల జీతాలను 3 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆశావర్కర్లు… జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఆయనను చాలాసార్లు కలిసి తమ వినతి పత్రాలను అందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయమైన ఆశావర్కర్ల డిమాండ్‌లను తీరుస్తామని అప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు […]

Advertisement
Update: 2019-06-03 05:12 GMT

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేశాక, ఇంకా మంత్రి వర్గం కూడా ఏర్పడక ముందే తాను ఇచ్చిన ఎన్నికల హామీలను వరుసగా నెరవేరుస్తున్నారు.

ఆశావర్కర్ల జీతాలను 3 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఆశావర్కర్లు… జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఆయనను చాలాసార్లు కలిసి తమ వినతి పత్రాలను అందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే న్యాయమైన ఆశావర్కర్ల డిమాండ్‌లను తీరుస్తామని అప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆశావర్కర్లకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అయింది.

Tags:    
Advertisement

Similar News