శర్వా సినిమాకి డేట్ ఫిక్స్ అయ్యింది

“పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్ ని అందుకున్న శర్వానంద్ తన తదుపరి సినిమాని సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ఫారిన్ లో ఒక సాంగ్ పూర్తి చేసుకొని వచ్చిన ఈ సినిమా యూనిట్…. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అవును ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 31వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే డేట్ ని నిర్మాతలు ఫిక్స్ చేసి […]

Advertisement
Update: 2019-03-08 02:04 GMT

“పడి పడి లేచే మనసు” సినిమాతో ఫ్లాప్ ని అందుకున్న శర్వానంద్ తన తదుపరి సినిమాని సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇటీవలే ఫారిన్ లో ఒక సాంగ్ పూర్తి చేసుకొని వచ్చిన ఈ సినిమా యూనిట్…. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

అవును ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 31వ తేదీన విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే డేట్ ని నిర్మాతలు ఫిక్స్ చేసి ఉంటే శర్వానంద్ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియ దర్శని లు ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూర్తి స్థాయి గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుధీర్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. అందులో ఒకటి ముసలివాడి పాత్రగా ఉంటుంది అని ఫిలిం నగర్ టాక్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News