వైవీని పక్కనపెట్టిన జగన్‌.... గృహ ప్రవేశానికి డుమ్మా....

ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్‌ జగన్‌ తేల్చేసినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వలేనని తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ స్పష్టం చేశారని చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా వైవీకే జగన్ చెప్పేశారు. దాంతో ఆయన అలిగినట్టు చెబుతున్నారు. టికెట్ నిరాకరించారన్న కోపంతోనే వైవీ సుబ్బారెడ్డి… జగన్‌ గృహప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు. ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా […]

Advertisement
Update: 2019-02-27 21:35 GMT

ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్‌ జగన్‌ తేల్చేసినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వలేనని తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి జగన్‌ స్పష్టం చేశారని చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. ఆయనకే ఎంపీ టికెట్ ఇస్తానని జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.

ఈ విషయాన్ని నేరుగా వైవీకే జగన్ చెప్పేశారు. దాంతో ఆయన అలిగినట్టు చెబుతున్నారు. టికెట్ నిరాకరించారన్న కోపంతోనే వైవీ సుబ్బారెడ్డి… జగన్‌ గృహప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరుకాలేదు.

ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్‌… బంధుత్వాల ఆధారంగా టికెట్లు ఇచ్చేందుకు సుముఖంగా లేరు. మాగుంట శ్రీనివాస రెడ్డి పార్టీలోకి వస్తే ఒంగోలు ఎంపీ సీటును ఈజీగా గెలవడంతో పాటు, ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్‌ చేసేందుకు అవకాశం ఉంటుందని జగన్‌ భావిస్తున్నారు. కావలి నియోజకవర్గంలో వైసీపీ గెలుపుమీద మాగుంట కుటుంబం ప్రభావం ఉంటుంది.

ఇవన్నీ ఆలోచించే వైవీని పక్కనపెట్టి మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే మాగుంట వైసీపీలో చేరుతారని టీడీపీ మీడియా కూడా ధృవీకరిస్తోంది.

Tags:    
Advertisement

Similar News