జగన్‌ వద్దకు గౌరు దంపతులు... ఉంటారా? వెళ్తారా?

వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటన ముగిసింది. నేడు ఉదయం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. రాగానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు నేడు వైఎస్ జగన్‌ను కలుస్తారు. పాణ్యం టికెట్‌ ఈసారి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారన్న ప్రచారం నేపథ్యంలో గౌరు చరిత దంపతులు పార్టీ అధినేతను కలుస్తున్నారు. టికెట్ దక్కపోతే గౌరు దంపతులు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. మార్చి మొదటి వారంలో గౌరు దంపతులు టీడీపీలో చేరుతారని […]

Advertisement
Update: 2019-02-25 21:08 GMT

వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటన ముగిసింది. నేడు ఉదయం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారు. రాగానే ఆయన పార్టీ కార్యక్రమాల్లో బిజీ కానున్నారు. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు నేడు వైఎస్ జగన్‌ను కలుస్తారు.

పాణ్యం టికెట్‌ ఈసారి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారన్న ప్రచారం నేపథ్యంలో గౌరు చరిత దంపతులు పార్టీ అధినేతను కలుస్తున్నారు. టికెట్ దక్కపోతే గౌరు దంపతులు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

మార్చి మొదటి వారంలో గౌరు దంపతులు టీడీపీలో చేరుతారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ భేటీలో గౌరు దంపతులకు జగన్‌ పాణ్యం టికెట్‌పై హామీ ఇస్తారా? ఒకవేళ టికెట్ గ్యారెంటీ ఇవ్వలేకపోయినా మరో మార్గంలో బుజ్జగిస్తారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News