వైసీపీలోకి పనబాక?

ఇటీవల కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరగా… ఇప్పుడు మరో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. నెల్లూరు నుంచి మూడు సార్లు, బాపట్ల నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి మన్మోహన్‌ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా చేసిన పనబాక లక్ష్మీ వైసీపీలో చేరుతారని వార్తలొస్తున్నాయి. పనబాక లక్ష్మీ, ఆమె భర్త కృష్ణయ్య వైసీపీలో చేరుతారని సమాచారం. ప్రస్తుతం జగన్‌ లండన్‌లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే వారు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. […]

Advertisement
Update: 2019-02-22 00:47 GMT

ఇటీవల కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరగా… ఇప్పుడు మరో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. నెల్లూరు నుంచి మూడు సార్లు, బాపట్ల నుంచి ఒకసారి ఎంపీగా గెలిచి మన్మోహన్‌ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా చేసిన పనబాక లక్ష్మీ వైసీపీలో చేరుతారని వార్తలొస్తున్నాయి.

పనబాక లక్ష్మీ, ఆమె భర్త కృష్ణయ్య వైసీపీలో చేరుతారని సమాచారం. ప్రస్తుతం జగన్‌ లండన్‌లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే వారు వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

రైల్వేలో ఉన్నత పదవిలో పనిచేసిన పనబాక లక్ష్మీ భర్త కృష్ణయ్య రెండుసార్లు గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి పనబాక లక్ష్మీ దంపతులు వైసీపీలో చేరితే ఆమెకు బాపట్ల ఎంపీ, కృష్ణయ్యకు గూడూరు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వైసీపీ తరపున గెలిచిన సునీల్‌ టీడీపీలోకి ఫిరాయించారు. దీంతో అక్కడ వైసీపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది.

Tags:    
Advertisement

Similar News