వరుస ఫ్లాప్స్..... బోయపాటిని మళ్ళీ పిలిచాడట!

డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్ లో “వినయ విధేయ రామ” పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. బోయపాటి శ్రీను గత సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులని అలరించినవే. కానీ “వినయ విధేయ రామ” అయితే మాస్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాని బాలక్రిష్ణతో  చేయబోతున్నాడు. ఆల్రెడీ వీళ్ళది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ బాలక్రిష్ణ కి మాత్రం బోయపాటి […]

Advertisement
Update: 2019-02-02 21:00 GMT

డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్ లో “వినయ విధేయ రామ” పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. బోయపాటి శ్రీను గత సినిమాలన్నీ మాస్ ప్రేక్షకులని అలరించినవే. కానీ “వినయ విధేయ రామ” అయితే మాస్ ప్రేక్షకులని కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాని బాలక్రిష్ణతో చేయబోతున్నాడు. ఆల్రెడీ వీళ్ళది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ బాలక్రిష్ణ కి మాత్రం బోయపాటి శ్రీను పై నమ్మకం తగ్గిందని అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా బాలక్రిష్ణ కథ ఫైనల్ అయ్యాక మళ్ళీ ఆ కథ గురించి చర్చించడట.

కానీ ఫస్ట్ టైం బోయపాటి శ్రీను ని “ఎన్టీఆర్-మహానాయకుడు” సెట్స్ కి పిలిచిమరీ కథ గురించి చర్చించాడట బాలకృష్ణ.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న బాలకృష్ణ…. బోయపాటి శ్రీను “వినయ విధేయ రామ” డిజాస్టర్ ఎఫెక్ట్…. ఈ సారి కథ విషయంలో జాగ్రత్తగా ఉండాలని బాలకృష్ణ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News