పిచ్చిపిచ్చిగా మాట్లాడితే .... " పవన్‌ కల్యాణ్ వార్నింగ్

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని… మార్చిలో పొత్తు చర్చలు జరగవచ్చంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. పెద్దమనిషిగా మాట్లాడు…. లేదంటే తాను కూడా నోరు అదుపు తప్పి మాట్లాడాల్సి ఉంటుందని టీజీని పవన్ హెచ్చరించారు. అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో తాను మద్దతు ఇస్తేనే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని టీడీపీ నేతలు మరిచిపోకూడదన్నారు. తాను నోరు విప్పితే మీరేమవుతారో ఆలోచించుకోండి అని టీడీపీ […]

Advertisement
Update: 2019-01-23 05:00 GMT

వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందని… మార్చిలో పొత్తు చర్చలు జరగవచ్చంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

పెద్దమనిషిగా మాట్లాడు…. లేదంటే తాను కూడా నోరు అదుపు తప్పి మాట్లాడాల్సి ఉంటుందని టీజీని పవన్ హెచ్చరించారు. అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో తాను మద్దతు ఇస్తేనే అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని టీడీపీ నేతలు మరిచిపోకూడదన్నారు.

తాను నోరు విప్పితే మీరేమవుతారో ఆలోచించుకోండి అని టీడీపీ నేతలను ఉద్దేశించి పవన్‌ వ్యాఖ్యానించారు. కిడారి సర్వేశ్వరరావు, సోమలు హత్యకు గురవ్వడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.

ఏమీ ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానన్నారు. టీజీ వెంకటేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్‌ ఇచ్చారు. జనసేన వద్దనుకున్న రాజ్యసభ సీటును టీజీ తీసుకున్నారని పవన్ ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News