రగులుతున్న బాలకృష్ణ.... కానీ అప్పటి వరకు నోరు విప్పడట!

నటుడు బాలకృష్ణకు, మెగా బ్రదర్ నాగబాబుకు మధ్య వార్‌ నడుస్తూనే ఉంది. మెగా బ్రదర్స్‌ను చులకన చేస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల నాగబాబు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. బాలకృష్ణ ఎప్పుడు ఏమన్నారో గుర్తు చేసి మరీ విరుచుకు పడుతున్నారు. బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ దాడి మొదలుపెట్టిన నాగబాబు…. అలగా జనంతో వస్తున్నపార్టీ అంటూ జనసేనపై పరోక్షంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణకు ఎంత అహంకారం ఉంటే…. మిగిలిన కులాలను […]

Advertisement
Update: 2019-01-08 01:37 GMT

నటుడు బాలకృష్ణకు, మెగా బ్రదర్ నాగబాబుకు మధ్య వార్‌ నడుస్తూనే ఉంది. మెగా బ్రదర్స్‌ను చులకన చేస్తూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల నాగబాబు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. బాలకృష్ణ ఎప్పుడు ఏమన్నారో గుర్తు చేసి మరీ విరుచుకు పడుతున్నారు.

బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ దాడి మొదలుపెట్టిన నాగబాబు…. అలగా జనంతో వస్తున్నపార్టీ అంటూ జనసేనపై పరోక్షంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణకు ఎంత అహంకారం ఉంటే…. మిగిలిన కులాలను సంకరజాతి వారు అంటూ కించపరుస్తారని ప్రశ్నించారు. అయితే నాగబాబు ఇంతగా విమర్శలు చేస్తున్నా బాలకృష్ణ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.

నాగబాబు వ్యాఖ్యలు బాలకృష్ణ దృష్టికి వెళ్లాయి. తనను ఇలా బహిరంగంగా నాగబాబు విమర్శిస్తుండడంపై బాలకృష్ణ లోలోన రగిలిపోతున్నాడట. కానీ తిరిగి స్పందించేందుకు సరైన సమయం కాదని ఆయన భావిస్తున్నాడట.

ఎన్టీఆర్‌ బయోపిక్ విడుదలవుతున్న తరుణంలో… నాగబాబు వ్యాఖ్యలపై స్పందిస్తే సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం ఉంటుందని బాలకృష్ణ భావిస్తున్నాడని చెబుతున్నారు. నాగబాబు వ్యాఖ్యలకు స్పందిస్తే ఎన్టీఆర్‌ బయోపిక్‌లో తన పాత్రలపై వ్యతిరేక ప్రచారం జరిగే చాన్స్‌ కూడా ఉందన్నది అబిప్రాయం.

అందుకే నాగబాబు వరుసగా కౌంటర్లు ఇస్తున్నా…. బాలకృష్ణ మాత్రం ప్రస్తుతానికి మౌనంగా ఉండేందుకు ఇష్టపడుతున్నాడట. పైగా జనసేన సాయాన్ని మరోసారి చంద్రబాబు కోరుతున్నారు. ఈ తరుణంలో బాలకృష్ణ సంయమనం పాటించడమే మంచిదని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారట.

Tags:    
Advertisement

Similar News