అధికారంలోకి రావాలంటే డబ్బులు కావాలి.... అందుకు అక్కడ వ్యాపారం చేస్తా....

కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని…. అందుకు బాగా డబ్బు అవసరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవసరమైన డబ్బు కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తానని…. అవసరమైతే ఆస్తులు అమ్మి అయినా పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తానని జగ్గారెడ్డి చెప్పారు. ఇవాళ సంగారెడ్డిలోని మల్కాపూర్‌లో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. తాను ఇకపై సీఎం కేసీఆర్‌ను విమర్శించనని…. మీరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు పెట్టుకోవద్దని జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు. […]

Advertisement
Update: 2018-12-28 04:30 GMT

కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని…. అందుకు బాగా డబ్బు అవసరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అవసరమైన డబ్బు కోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తానని…. అవసరమైతే ఆస్తులు అమ్మి అయినా పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తానని జగ్గారెడ్డి చెప్పారు. ఇవాళ సంగారెడ్డిలోని మల్కాపూర్‌లో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించారు.

తాను ఇకపై సీఎం కేసీఆర్‌ను విమర్శించనని…. మీరు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు పెట్టుకోవద్దని జగ్గారెడ్డి కార్యకర్తలకు సూచించారు.

వచ్చే ఐదేళ్లు పార్టీ బలోపేతం కావడానికి కృషి చేద్దాం…. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటా…. మీరు కూడా ఓపికతో పని చేయాలని అన్నారు. పార్టీ విజయం కోసం కార్యకర్తలు కూడా ఆస్తులు అమ్ముకోవడానికి సిద్దంగా ఉండాలని కోరారు.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీ కోసం కార్యకర్తలు పెట్టిన ప్రతీ రూపాయికి రెట్టింపు డబ్బు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News