రంగంలోకి ఎన్‌ఐఏ... టీడీపీ నేత అరెస్ట్

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్‌ బ్రాంచ్ ఎన్‌ఐఏ అధికారులు… కిడారి హత్యకు సహకరించిన టీడీపీ నేత యెడల సుబ్బారావును అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు శోభన్‌, ఈశ్వరి, కొర్ర కమలను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ. మావోయిస్టుల దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం… మావోయిస్టులకు స్థానిక రాజకీయ నాయకులు సహకరించడంపై లోతుగా దర్యాప్తు […]

Advertisement
Update: 2018-12-14 23:37 GMT

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ-ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్‌ బ్రాంచ్ ఎన్‌ఐఏ అధికారులు… కిడారి హత్యకు సహకరించిన టీడీపీ నేత యెడల సుబ్బారావును అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు శోభన్‌, ఈశ్వరి, కొర్ర కమలను అరెస్ట్ చేసింది ఎన్‌ఐఏ.

మావోయిస్టుల దాడిని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం… మావోయిస్టులకు స్థానిక రాజకీయ నాయకులు సహకరించడంపై లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏపీ పోలీసుల నుంచి కేసును ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC