మళ్ళీ ఒకే వేదిక పై సందడి చేయనున్న మెగా బ్రదర్స్‌?

మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే వేదిక మీద కలిసి చాలా కాలం అయ్యింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత వీళ్ళిద్దరూ ఒకే వేదికపై నిలబడనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు చిరు, పవన్ వస్తున్నారట. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “అంతరిక్షం”. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి తెలుసు సినిమా ఇదే. డిసెంబర్ 21న […]

Advertisement
Update: 2018-11-24 01:01 GMT

మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకే వేదిక మీద కలిసి చాలా కాలం అయ్యింది. అయితే మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత వీళ్ళిద్దరూ ఒకే వేదికపై నిలబడనున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు చిరు, పవన్ వస్తున్నారట. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “అంతరిక్షం”. స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మొదటి తెలుసు సినిమా ఇదే.

డిసెంబర్ 21న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 9న ఫిక్స్ చేశారు మూవీ యూనిట్. ఆ వేడుకకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారట. వారు ఈ ఈవెంట్ కి వచ్చి ఇప్పటికే సక్సెస్ లో ఉన్న వరుణ్ తేజ్ కి మరింత బలం చేకూర్చాలని డిసైడ్ అయ్యారట.

Tags:    
Advertisement

Similar News