చంద్రబాబు జీవో టిష్యూ పేపర్తో సమానం " ఉండవల్లి
సీబీఐపై ఆంక్షలు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీబీఐ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఇచ్చిన జీవోపై ఉండవల్లి స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో టిష్యూ పేపర్తో సమానమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జీవోలు తెచ్చినా కోర్టులు ఆదేశిస్తే తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాల్సి ఉంటుందన్నారు. జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారన్నారు. ఇలాంటి జీవోలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పరువు […]
సీబీఐపై ఆంక్షలు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. సీబీఐ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ చంద్రబాబు ఇచ్చిన జీవోపై ఉండవల్లి స్పందించారు.
చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో టిష్యూ పేపర్తో సమానమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని జీవోలు తెచ్చినా కోర్టులు ఆదేశిస్తే తప్పనిసరిగా సీబీఐ విచారణ జరగాల్సి ఉంటుందన్నారు.
జీవో ఇవ్వడమే హాస్యాస్పదమని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారన్నారు. ఇలాంటి జీవోలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బ్యాలెన్స్డ్గా మాట్లాడాలన్నారు. వెంటనే జీవోను రద్దు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.