కీర్తిసురేష్, కైరా వారి సరసనా...!

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చినప్పట్నుంచి ఈ ప్రాజెక్టులో హీరోయిన్లు ఎవరనే టాపిక్ పై దశలవారీగా హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. రాశిఖన్నా, తమన్న, కాజల్.. ఇలా ఎన్నో పేర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నేపథ్యంలో.. మరో రెండు కొత్త పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. అవును.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ లో హీరోయిన్లుగా కీర్తిసురేష్, కైరా అద్వానీలను అనుకుంటున్నారట. ఈ మేరకు రాజమౌళి తరఫున […]

Advertisement
Update: 2018-11-13 22:32 GMT

రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చినప్పట్నుంచి ఈ ప్రాజెక్టులో హీరోయిన్లు ఎవరనే టాపిక్ పై దశలవారీగా హాట్ డిస్కషన్ నడుస్తూనే ఉంది. రాశిఖన్నా, తమన్న, కాజల్.. ఇలా ఎన్నో పేర్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నేపథ్యంలో.. మరో రెండు కొత్త పేర్లు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

అవును.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ లో హీరోయిన్లుగా కీర్తిసురేష్, కైరా అద్వానీలను అనుకుంటున్నారట. ఈ మేరకు రాజమౌళి తరఫున కొందరు వ్యక్తులు వెళ్లి ఈ ఇద్దరు హీరోయిన్లను కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. వీళ్లలో ఎన్టీఆర్ సరసన కైరా అద్వానీ, రామ్ చరణ్ సరసన కీర్తిసురేష్ ను హీరోయిన్లుగా అనుకుంటున్నాడట రాజమౌళి.

రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ ఆల్రెడీ నటిస్తోంది. వినయ విధేయ రామ సినిమాలో వీళ్లిద్దరే హీరోహీరోయిన్లు. అందుకే కాస్త వెరైటీగా ఉంటుందనే ఉద్దేశంతో.. మల్టీస్టారర్ లో కైరా అద్వానీని ఎన్టీఆర్ సరసన ఫిక్స్ చేశారట. మరో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. సినిమాలో ఈ హీరోయిన్లిద్దరూ అస్సలు కలుసుకోరట.

ఇలా ఈ బడా మల్టీస్టారర్ పై తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి అందుబాటులో లేడు. సినిమా ఓపెనింగ్ కే మీడియాను దూరం పెట్టిన రాజమౌళి, ఇలాంటి పుకార్లపై స్పష్టత ఇస్తాడని ఆశించడం అవివేకం అవుతుంది.

Tags:    
Advertisement

Similar News