టీడీపీ తొలి జాబితా రెడీ ! బీసీలకు రెండే టికెట్లు !
తెలంగాణ తెలుగుదేశం జాబితా రెడీ అయింది. కాంగ్రెస్ జాబితా విడుదలైన మరుక్షణమే టీడీపీ లిస్ట్ విడుదల చేయబోతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థిత్వాలను ఓకే చేసినట్లు సమాచారం. 1. ఖమ్మం – నామా నాగేశ్వర రావు 2. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య 3. అశ్వరావు పేట – మచ్చ నాగేశ్వర రావు 4. వరంగల్ వెస్ట్ – రేవురి ప్రకాష్ రెడ్డి 5. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి 6. మహబూబ్ నగర్ […]
తెలంగాణ తెలుగుదేశం జాబితా రెడీ అయింది. కాంగ్రెస్ జాబితా విడుదలైన మరుక్షణమే టీడీపీ లిస్ట్ విడుదల చేయబోతోంది. ఇప్పటికే 11 మంది అభ్యర్థిత్వాలను ఓకే చేసినట్లు సమాచారం.
1. ఖమ్మం – నామా నాగేశ్వర రావు
2. సత్తుపల్లి – సండ్ర వెంకట వీరయ్య
3. అశ్వరావు పేట – మచ్చ నాగేశ్వర రావు
4. వరంగల్ వెస్ట్ – రేవురి ప్రకాష్ రెడ్డి
5. మక్తల్ – కొత్తకోట దయాకర్ రెడ్డి
6. మహబూబ్ నగర్ – ఎర్ర శేఖర్
7. ఉప్పల్ – వీరేందర్ గౌడ్
8. శేరిలింగంపల్లి – భవ్య ఆనంద్ ప్రసాద్
10. కూకట్ పల్లి – పెద్ది రెడ్డి
11.నిజామాబాద్ రూరల్ – మండవ వెంకటేశ్వర రావు
ఈ 11 సీట్లు కాకుండా మరో మూడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కూటమిలో భాగంగా టీడీపీకి 14 సీట్లు ఇచ్చారు. అయితే 11 సీట్లపై కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అయితే ఆలేరు, నకిరేకల్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కోదాడ, పఠాన్ చెరువు, నారాయణ ఖేడ్, లో ఏవైనా మూడు లేదా నాలుగు సీట్లు ఇవ్వాలని టీడీపీ అడుగుతోంది.
అయితే కాంగ్రెస్ ఈ స్థానాల్లో నకిరేకల్, ఖైరతాబాద్ ఇచ్చేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. మరో సీటుపై పీటముడి కొనసాగుతోంది. కోదాడ టికెట్ బొల్లం మల్లయ్య యాదవ్ అడుగుతున్నారు. అయితే ఆ సీటు టీడీపీకి ఇస్తారా? లేదా అనేది ఇంకా తేలలేదు.