రేపిస్టుల అడ్డాగా మారిన అసోం
అసోం రాష్ట్రం రేపిస్టులకు అడ్డాగా మారింది. పోలీసు యంత్రాంగం నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో రేపిస్టులు రెచ్చిపోతున్నారు. స్త్రీలను బలాత్కారాలు చేస్తున్నారు. ఎటువంటి శిక్షలు పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అసోంలో 4,130 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వరకట్న సంబందిత కేసులు 15,000 నమోదయ్యాయి. అసోం గణపరిషత్ శాసనసభ్యుడు రామేంద్ర నారాయణ్ కలితా అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చంద్ర మోహన్ ఈ వివరాలు వెల్లడించారు. రాష్ట్ర హోం […]
అసోం రాష్ట్రం రేపిస్టులకు అడ్డాగా మారింది. పోలీసు యంత్రాంగం నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో రేపిస్టులు రెచ్చిపోతున్నారు. స్త్రీలను బలాత్కారాలు చేస్తున్నారు. ఎటువంటి శిక్షలు పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అసోంలో 4,130 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వరకట్న సంబందిత కేసులు 15,000 నమోదయ్యాయి. అసోం గణపరిషత్ శాసనసభ్యుడు రామేంద్ర నారాయణ్ కలితా అసెంబ్లీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చంద్ర మోహన్ ఈ వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర హోం మంత్రి కూడా అయిన సోనోవాల్కు బదులుగా మంత్రి చంద్ర మోహన్ నేరాల వివరాలను గణాంకాలతో సహా సభకు తెలియజేశారు.1543 కిడ్నాప్ కేసులు, 457 లైంగిక వేధింపుల కేసులు కూడా నమోదైనట్లు మంత్రి చంద్ర మోహన్ తెలిపారు.