ఆవులతో ఎద్దులతో మాట్లాడిస్తా " నిత్యానంద!

సెక్స్‌ టేపుల కుంభకోణంలో విచారణను ఎదుర్కొన్న స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. ఆవులతోనూ, ఎద్దులతోనూ తాను సంస్కృతం, తమిళం మాట్లాడించగలనని అంటున్నారు. మానవేతర జీవులతో మాట్లాడించగలిగిన మానవాతీత శక్తులు తనకు ఉన్నాయని ఆయన ప్రకటించారు. తన తాజా ప్రసంగంలో నిత్యానంద ఈ ప్రకటనలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. మనిషికి ఉన్న అనేక అంతర్గత అవయవాలు జంతువులకు లేవని వివరిస్తూ మనం వాటిని కృత్రిమంగా పెంపొందించవచ్చని పేర్కొన్నారు. వాటిని […]

Advertisement
Update: 2018-09-20 01:16 GMT

సెక్స్‌ టేపుల కుంభకోణంలో విచారణను ఎదుర్కొన్న స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద మరో సంచలన ప్రకటన చేశారు. ఆవులతోనూ, ఎద్దులతోనూ తాను సంస్కృతం, తమిళం మాట్లాడించగలనని అంటున్నారు. మానవేతర జీవులతో మాట్లాడించగలిగిన మానవాతీత శక్తులు తనకు ఉన్నాయని ఆయన ప్రకటించారు. తన తాజా ప్రసంగంలో నిత్యానంద ఈ ప్రకటనలు చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. మనిషికి ఉన్న అనేక అంతర్గత అవయవాలు జంతువులకు లేవని వివరిస్తూ మనం వాటిని కృత్రిమంగా పెంపొందించవచ్చని పేర్కొన్నారు. వాటిని శాస్త్రీయ, వైద్య, పరిశోదనల పరంగా రుజువు చేయవచ్చని ఆయన అంటున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించిన తర్వాతే తాను ఈ నిర్ధారణకు వచ్చినట్లు నిత్యానంద చెప్పారు. ఈ పరిశోధనను తాను యాధృచ్ఛికంగా చేశానని, అద్భుతమైన ఫలితం కనిపించిందని అన్నారు. ‘గుర్తు పెట్టుకోండి ఏడాది లోపు దీనిని రుజువు చేసి చూపిస్తా’ అని నిత్యానంద అన్నారు. కోతులకు, సింహాలకు, పులులకు సరిపడే స్వరపేటికను తయారుచేస్తానని తెలిపారు. అలాగే ఆవులు, ఎద్దులు సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్పష్టంగా మాట్లాడగలిగేలా చేస్తానని కూడా నిత్యానంద చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News