ఈసారైనా మోత్క‌ప‌ల్లి ఆశ నెర‌వేరేనా?

తెలంగాణ తెలుగుదేశంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రెండేళ్ల నుంచి క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న వ్యక్తి మోత్కుప‌ల్లి న‌రసింహులు. ఈయ‌న‌కు చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ గిరి ఇప్పిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయ‌నలో దాదాపుగా అడుగంటి పోయాయ‌నుకున్న ఆశ‌లు మ‌ళ్లీ చిగురించాయి. ఎందుకంటే మోత్కుప‌ల్లి బ‌యోడేటాను కేంద్రం తెప్పించుకుంద‌న్న వార్త ఇప్పుడు మీడియాలో హ‌ల్‌చ‌ల్  చేస్తోంది. ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా ఎంపిక చేసేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంద‌న్న వార్త తెలంగాణ తెలుగుదేశం నేతల్లో ఒక‌ర‌క‌మైన కొత్త […]

Advertisement
Update: 2016-09-03 23:14 GMT

తెలంగాణ తెలుగుదేశంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రెండేళ్ల నుంచి క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న వ్యక్తి మోత్కుప‌ల్లి న‌రసింహులు. ఈయ‌న‌కు చంద్ర‌బాబు గ‌వ‌ర్న‌ర్ గిరి ఇప్పిస్తానని గతంలోనే హామీ ఇచ్చారు. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో ఆయ‌నలో దాదాపుగా అడుగంటి పోయాయ‌నుకున్న ఆశ‌లు మ‌ళ్లీ చిగురించాయి. ఎందుకంటే మోత్కుప‌ల్లి బ‌యోడేటాను కేంద్రం తెప్పించుకుంద‌న్న వార్త ఇప్పుడు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆయ‌న్ను గ‌వ‌ర్న‌ర్‌గా ఎంపిక చేసేందుకు కేంద్రం క‌స‌ర‌త్తు చేస్తోంద‌న్న వార్త తెలంగాణ తెలుగుదేశం నేతల్లో ఒక‌ర‌క‌మైన కొత్త ఉత్సాహం నింపింది.

ఇటీవ‌ల త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ పోస్టు ఖాళీ కావ‌డంతో ఆ ప‌ద‌విపై మోత్కుప‌ల్లి గండ‌పెడాశ‌లు పెట్టుకున్నారు. కానీ, చివ‌రికి ఆ పోస్టులో శాశ్వ‌తంగాఎవ‌రినీ నియ‌మించ‌లేదు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావుకు అద‌నంగా త‌మిళ‌నాడు బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంతో మోత్కుప‌ల్లి నీరుగారిపోయారు. పైగా ఇదే పోస్టుపై గుజ‌రాత్ మాజీ సీఎం ఆనందిబెన్ ఆశ‌లు పెట్టుకున్నార‌ని వార్త‌లు రావ‌డంతో ఇక మోత్కుప‌ల్లికి ఎలాంటి అవ‌కాశం లేద‌ని తెలిసిపోయింది. కానీ, తాజాగా కేంద్రం మోత్కుప‌ల్లి బ‌యోడేటాను తెప్పించుకుంద‌న్న తెలియ‌డంతో ఆయ‌న తిరిగి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి, ఈసారైనా ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్కుతుందా? లేదా భంగ‌పాటే ఎదుర‌వుతుందా? అన్న స‌స్పెన్స్ వీడాలంటే మ‌రో రెండు నెల‌లు వేచి చూడాల్సిందే!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News