బాబు ఆమరణ దీక్ష చేస్తే హోదా ఖాయం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమరణ దీక్ష చేస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం దాసరి నారాయణరావును ఆయన కలిశారు. కాపు ఉద్యమంపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి చిరంజీవి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముద్రగడ… చంద్రబాబు ఆమరణ దీక్ష చేస్తే వెంటనే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. సీఎంతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌, […]

Advertisement
Update: 2016-08-29 23:43 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమరణ దీక్ష చేస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం దాసరి నారాయణరావును ఆయన కలిశారు. కాపు ఉద్యమంపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి చిరంజీవి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పల్లంరాజు, అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ముద్రగడ… చంద్రబాబు ఆమరణ దీక్ష చేస్తే వెంటనే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. సీఎంతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌, పవన్‌ కల్యాణ్ ఆమరణ దీక్ష చేస్తే తాను కూడా వారితో పాటు దీక్షకు దిగేందుకు సిద్ధమన్నారు. పవన్‌ కల్యాణ్ ఉద్యమానికి కాపు ఉద్యమం పోటీ కాదన్నారు. ప్రభుత్వం కాపులను దగా చేస్తే ఏం చేయాలన్న దానిపై దాసరి నారాయణ రావు నుంచి సలహాలు తీసుకున్నానని చెప్పారు. సమావేశంలో మేమంతా మీ వెంట ఉంటామని ముద్రగడకు దాసరి హామీ ఇచ్చారు. వచ్చే నెల 11న రాజమండ్రిలో నిర్వహించే కాపు సంఘాల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చేయాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News