పోటీకి నేను సై " పిన్నెల్లి

టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేనికి సవాల్‌ విసిరారు. భూదందాలు, అవినీతి, దౌర్జన్యాలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును ఓడించేందుకు తాను సిద్ధమన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో యరపతినేనిపై పోటీకి తాను సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఇందుకు యరపతినేని సిద్ధమా అని సవాల్ విసిరారు. గురజాల ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన బాధితులంతా […]

Advertisement
Update: 2016-08-23 22:39 GMT

టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేనికి సవాల్‌ విసిరారు. భూదందాలు, అవినీతి, దౌర్జన్యాలు చేస్తూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును ఓడించేందుకు తాను సిద్ధమన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో యరపతినేనిపై పోటీకి తాను సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఇందుకు యరపతినేని సిద్ధమా అని సవాల్ విసిరారు.

గురజాల ఎమ్మెల్యే ద్వారా నష్టపోయిన బాధితులంతా వ్యక్తిగతంగా తనను కలిసి వివరించారని, అవినీతి ఆధారాలతో సహా అన్ని తన దగ్గరున్నాయన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే గురజాల, సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాలలో అక్రమాలు, అన్యాయాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. పల్నాడు ప్రాంతంలో టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను చూస్తూ ఊరుకోమని, ప్రజా ఉద్యమంతో వారి ఆగడాలను అడ్డుకుంటామన్నారు. నాసికరం పుష్కరఘాట్‌ల నిర్మాణం జరిపి ప్రజాధనాన్ని దోచుకున్న తీరుకు నిరసనగానే తాను తెలంగాణ ఘాట్‌లో స్నానమాచరించానని చెప్పారు. ఎవరు దైవ భక్తులో, ఎవరు పల్నాటి ప్రజల రక్తాన్ని తాగుతున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు పిన్నెల్లి.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News