తెలుగు తమ్ముళ్లూ... చంద్రబాబు బొమ్మతో పిండప్రదానమా?

పుష్కరాల ద్వారా చంద్రబాబును, టీడీపీని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుతమ్ముళ్లు ఏ చిన్నఅవకాశాన్నికూడా వదిలిపెట్టడం లేదు. అయితే ఈ ప్రయత్నాలు వికటించి నవ్వులపాలవుతున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే ఇబ్రహీంపట్నం వద్ద వెలుగుచూసింది. పుష్కరాలను చంద్రబాబే కనిపెట్టారన్న అభిప్రాయం అమాయక జనానికి కలిగించాలనుకున్నారో ఏమో గానీ తెలుగు తమ్ముళ్లు … ఏకంగా అక్కడే చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. బొమ్మ పూర్తయ్యాక అది ఏ రూపులో ఉందన్నది మరో అంశం. సాధారణంగా పిండప్రదానం చేసేటప్పుడు స్వర్గస్తులైన పెద్దల ఫొటోలు […]

Advertisement
Update: 2016-08-18 22:15 GMT

పుష్కరాల ద్వారా చంద్రబాబును, టీడీపీని ప్రమోట్ చేసుకునేందుకు తెలుగుతమ్ముళ్లు ఏ చిన్నఅవకాశాన్నికూడా వదిలిపెట్టడం లేదు. అయితే ఈ ప్రయత్నాలు వికటించి నవ్వులపాలవుతున్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే ఇబ్రహీంపట్నం వద్ద వెలుగుచూసింది. పుష్కరాలను చంద్రబాబే కనిపెట్టారన్న అభిప్రాయం అమాయక జనానికి కలిగించాలనుకున్నారో ఏమో గానీ తెలుగు తమ్ముళ్లు … ఏకంగా అక్కడే చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు చేశారు. బొమ్మ పూర్తయ్యాక అది ఏ రూపులో ఉందన్నది మరో అంశం. సాధారణంగా పిండప్రదానం చేసేటప్పుడు స్వర్గస్తులైన పెద్దల ఫొటోలు ఎదురుగా పెట్టుకుని కార్యక్రమం చేస్తారు.

అయితే ఇక్కడ కొందరు అత్యుత్సాహవంతులు చంద్రబాబు సైకత శిల్పాన్ని ముందుపెట్టుకుని పిండప్రదానం చేస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది కూడా ఆ విషయాన్ని సీరియస్‌గా పట్టించుకోలేదు. దీంతో వందలాది మంది చంద్రబాబు సైకత శిల్పాన్ని ఎదురుగా పెట్టుకుని పిండప్రదానం చేసి వెళ్లారు. అయితే పిండప్రదాన తీరుతెన్నులు తెలిసిన వారు మాత్రం ఇదేంటి చంద్రబాబు బొమ్మ ముందుపెట్టుకుని పిండప్రదానమా అని ఆశ్చర్యపోతున్నారు. దీన్ని అడ్డుకోకపోవడంపై డ్యూటీలో ఉన్న అధికారులపైనా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పుష్కరాల్లో టీడీపీ నేతలు ఆ మధ్య భక్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగును కాపాడేందుకే టీడీపీ పుట్టినట్టు చెప్పుకునే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ప్లెక్సీల్లో బూతులురాసి అందరికి షాక్ ఇచ్చారు. పుష్క‌ర స్నానం స‌క‌ల పాపాల హ‌ర‌ణం అని రాయబోయి… “పుష్క‌ర స్నానం స‌క‌ల పాపాల హారం” అని సెలవిచ్చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు అభిమానులు మరో అడుగు ముందుకేసి పుష్కరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు అయిందంటూ శుభాకాంక్షలు చెప్పారు.

ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అభిమాన సంఘం మరింత ముందుకెళ్లింది. రామ్మోహన్ నాయుడు ఎంపీ మాత్రమే అయినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ పుష్కరాల్లో ప్లెక్సీలు పెట్టారు. ఇలా ప్రతిచోట తెలుగు తమ్ముళ్ల పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌కు వెళ్లి బెడిసికొడుతోంది. వీటన్నింటిలో కంటే చంద్రబాబు బొమ్మ ముందు పిండప్రదానాలు చేయడం, దాన్ని అధికారులు అడ్డుకోకపోవడమే ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News