బాబు సీరియస్... సోషల్ మీడియాలో సెటైర్స్...

ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఉంటోంది. సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌కు సీఈవో అయ్యారంటే దానికి తానే కారణమని చెప్పి జనానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు… ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సింధును వదిలిపెట్టలేదు. ఆమె అహర్నిశలు కష్టపడి రియోలో రికార్డు సృష్టిస్తే దానికి తానే కారణమని చంద్రబాబు సెలవిచ్చారు. అప్పట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు క్రీడలను ప్రోత్సహించడం వల్లే నేడు సింధు ఒలంపిక్స్‌లో పతకం సాధించగలిగిందని (చంద్రబాబు ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి ఇంకా […]

Advertisement
Update: 2016-08-19 06:29 GMT

ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఒక్కోసారి ఆశ్చర్యకరంగా ఉంటోంది. సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్‌కు సీఈవో అయ్యారంటే దానికి తానే కారణమని చెప్పి జనానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు… ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సింధును వదిలిపెట్టలేదు. ఆమె అహర్నిశలు కష్టపడి రియోలో రికార్డు సృష్టిస్తే దానికి తానే కారణమని చంద్రబాబు సెలవిచ్చారు.

అప్పట్లో తాను సీఎంగా ఉన్నప్పుడు క్రీడలను ప్రోత్సహించడం వల్లే నేడు సింధు ఒలంపిక్స్‌లో పతకం సాధించగలిగిందని (చంద్రబాబు ఈ ప్రకటన విడుదల చేసే సమయానికి ఇంకా ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాలేదు, పతకం అందుకోలేదు) చెప్పారు. గోపిచంద్ అకాడమీకి భూమి ఇచ్చింది తానేనన్నారు. అప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు సింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిందని చెప్పారు. చంద్రబాబు విశాఖలో ఈ కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయకముందే కొందరు నెటిజన్లు… సింధుకు పతకం రావడం కూడా తన మహిమేనంటూ చంద్రబాబు ప్రచారం చేస్తారని సెటైర్లు వేశారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే సింధు పతకం ఖ్యాతిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో నెటిజన్ లు మరోసారి తమ పోస్టులకు పదును పెట్టారు. చంద్రబాబు ఎంత సీరియస్ గా చెప్పారో… నెటిజన్ అంతే కామెడీగా తీసుకొని సెటైర్లు వేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News