స్టేషన్‌లోనే కుమ్మేసుకున్నారు...

కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీలో మరోసారి అధిపత్యపోరు బహిర్గతమైంది.  జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఇటీవల టీడీపీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. గ్రామాల్లో ఈ రెండు వర్గాలు సై అంటే సై అనుకుంటున్నాయి. తాజాగా తాళ్లపొద్దుటూరులో ఇరు నాయకుల అనుచరులు తలబడ్డారు. నీరు- చెట్లు నిధులు పంచుకునే విషయంలో మొదలైన గొడవ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడా సెటిల్‌మెంట్‌ సాధ్యం కాకపోవడంతో ఇరు […]

Advertisement
Update: 2016-08-17 04:03 GMT

కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీలో మరోసారి అధిపత్యపోరు బహిర్గతమైంది. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఇటీవల టీడీపీలో చేర్చుకున్నారు. అప్పటి నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. గ్రామాల్లో ఈ రెండు వర్గాలు సై అంటే సై అనుకుంటున్నాయి. తాజాగా తాళ్లపొద్దుటూరులో ఇరు నాయకుల అనుచరులు తలబడ్డారు. నీరు- చెట్లు నిధులు పంచుకునే విషయంలో మొదలైన గొడవ స్టేషన్ వరకు వెళ్లింది. అక్కడా సెటిల్‌మెంట్‌ సాధ్యం కాకపోవడంతో ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలోనే కొట్టుకున్నారు. దాడిలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన 10 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తేరుకున్న పోలీసులు వెంటనే లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News