కూతురిని కిడ్నాప్‌ చేయబోయారు... నాకేమైనా జరిగితే పవన్‌దే బాధ్యత

తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయంటూ మీడియాకెక్కారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌ భాస్కర్‌. తనకు ఏమైనా జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు, నటుడు పవన్‌ కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్, చంద్రబాబును తాను విమర్శించానని అప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. చివరకు తాను కేంద్ర […]

Advertisement
Update: 2016-08-15 21:45 GMT

తనకు బెదిరింపుకాల్స్ వస్తున్నాయంటూ మీడియాకెక్కారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేరంగుల ఉదయ్‌ భాస్కర్‌. తనకు ఏమైనా జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు, నటుడు పవన్‌ కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్, చంద్రబాబును తాను విమర్శించానని అప్పటి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. చివరకు తాను కేంద్ర హోమ్ సెక్రెటరీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అందుకు స్పందించిన కేంద్రం తగిన రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని… అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉదయ్ భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు కూడా ఏపీ పోలీసులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం తాను హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. తనకు ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News