దినేష్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌కు నో చెప్పిన బీజేపీ

మాజీ డీజీపీ, బీజేపీ నేత దినేష్‌ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు బీజేపీ నాయకత్వం నో చెప్పింది. గ్యాంగ్ స్టర్‌ నయీంతో తనకు లింకులున్నట్టు పరోక్షంగా జరుగుతున్న ప్రచారంపై స్పందించేందుకు దినేస్ రెడ్డి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో ప్రెస్ మీట్ రద్దైంది. నయీం కేసుపై పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌ మీట్‌ పెట్టడం సరికాదని బీజేపీ నాయకత్వం సూచించిందని చెబుతున్నారు. అసలు నేరుగా […]

Advertisement
Update: 2016-08-13 01:10 GMT

మాజీ డీజీపీ, బీజేపీ నేత దినేష్‌ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకునేందుకు బీజేపీ నాయకత్వం నో చెప్పింది. గ్యాంగ్ స్టర్‌ నయీంతో తనకు లింకులున్నట్టు పరోక్షంగా జరుగుతున్న ప్రచారంపై స్పందించేందుకు దినేస్ రెడ్డి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో ప్రెస్ మీట్ రద్దైంది.

నయీం కేసుపై పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌ మీట్‌ పెట్టడం సరికాదని బీజేపీ నాయకత్వం సూచించిందని చెబుతున్నారు. అసలు నేరుగా పేరు బయటకు రానప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బీజేపీ నేతలు సలహా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ప్రెస్‌మీట్ రద్దు అయినట్టు ప్రకటించారు. 2014 ఎన్నికల తర్వాత దినేష్ రెడ్డి బీజేపీలో చేరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News