చంద్రబాబుపై జయలలిత సెటైర్లు

పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం జయలలిత అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కర్నాటక సీఎం సిద్ధరామయ్యలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని జయ అన్నారు. ఇందుకోసం ఇద్దరు సీఎంలు ఉచితంగా భూములు, ఇతర ప్రయోజనాలు కూడా ఇస్తామంటూ హోరెత్తిస్తున్నారని చెప్పారు. కానీ వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పెట్టుబడులు మాత్రం తమిళనాడుకే వస్తున్నాయని జయలలిత వివరించారు. ఏదైనా ఒక రాష్ట్రంలో వ్యాపారాలు లాభసాటిగా సాగాలంటే శాంతిభద్రతలు సక్రమంగా […]

Advertisement
Update: 2016-08-11 23:47 GMT

పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై తమిళనాడు సీఎం జయలలిత అసెంబ్లీలో సెటైర్లు వేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, కర్నాటక సీఎం సిద్ధరామయ్యలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రచారం చేసుకుంటున్నారని జయ అన్నారు. ఇందుకోసం ఇద్దరు సీఎంలు ఉచితంగా భూములు, ఇతర ప్రయోజనాలు కూడా ఇస్తామంటూ హోరెత్తిస్తున్నారని చెప్పారు. కానీ వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పెట్టుబడులు మాత్రం తమిళనాడుకే వస్తున్నాయని జయలలిత వివరించారు. ఏదైనా ఒక రాష్ట్రంలో వ్యాపారాలు లాభసాటిగా సాగాలంటే శాంతిభద్రతలు సక్రమంగా ఉండాలన్నారు. ఆ పరిస్థితి ఒక్క తమిళనాడులో మాత్రమే ఉందన్నారు. విద్యుత్ సరఫరా కూడా నిరంతరాయంగా తమిళనాడులో ఉంటోందన్నారు. ఏపీ, కర్నాటక రాష్ట్రాలే తమిళనాడు నుంచి విద్యుత్‌ను కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాయని జయలలిత వివరించారు. మొత్తం మీద ప్రచారం చేసుకోవడం ద్వారానో, విమానాలేసుకుని విదేశాల్లో తిరగడం వల్లనో పెట్టుబడులు రావని పరోక్షంగా జయలలిత చెప్పినట్టుగా ఉన్నారు.

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News