ఫిరాయింపు ఎమ్మెల్యే కక్ష సాధిస్తున్నారు... నేనూ సీరియస్‌గా స్పందిస్తా....

చంద్రబాబు వెలిగించిన ఫిరాయింపు కుంపట్లు టీడీపీలో పొగరాజేస్తున్నాయి. తాజాగా గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వైసీపీనుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తమను ఎమ్మెల్యే తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సమన్వయంతో నడిచానని తాను వ్యక్తిగతంగా నష్టపోయినా బాధపడలేదన్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీరు కక్ష సాధింపు ధోరణిలో ఉందని మండిపడ్డారు. ఆయన వల్ల ఆది నుంచి […]

Advertisement
Update: 2016-08-01 00:37 GMT

చంద్రబాబు వెలిగించిన ఫిరాయింపు కుంపట్లు టీడీపీలో పొగరాజేస్తున్నాయి. తాజాగా గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు తన ఆవేదన, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. వైసీపీనుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తమను ఎమ్మెల్యే తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సమన్వయంతో నడిచానని తాను వ్యక్తిగతంగా నష్టపోయినా బాధపడలేదన్నారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తీరు కక్ష సాధింపు ధోరణిలో ఉందని మండిపడ్డారు. ఆయన వల్ల ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెప్పారు.

తాను అధినాయకత్వాన్ని ధిక్కరించే వ్యక్తిని కాదన్నారు…. అయితే తన ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి వస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ప్రస్తుతం పార్టీ కార్యకర్తలకు కచ్చితంగా అన్యాయం జరుగుతోందన్నారు. టీడీపీ కుటుంబాలకు చెందిన చిన్నచిన్న ఉద్యోగులను కూడా ఎమ్మెల్యే దూరంగా బదిలీ చేయిస్తున్నారని ఆక్షేపించారు. గ్రామాల వారీగా అధిపత్యం కోసం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన కోసం తాను తాపత్రయపడనని… కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం సీరియస్‌గానే స్పందించాల్సి ఉంటుందని అన్నా రాంబాబు హెచ్చరించారు.

Also Read సెక్స్ అడిక్ట్‌గా అవ‌స‌రాల శ్రీనివాస్…

వాళ్లిద్దరూ ఎంత క్లోజో మీరే చూడండి…

అమ‌లాపాల్ కాపురంలో చిచ్చుకు అదే కార‌ణ‌మా..!

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News