బాబుతో మీరు మాట్లాడుతారా?... నన్నే రమ్మంటారా?

విజయవాడలో వైఎస్ విగ్రహం కూల్చివేతపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చివేయడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్‌లకు లగడపాటి ఫోన్ చేశారు. వెంటనే విగ్రహాన్ని పునర్‌ప్రతిష్టించేలా చంద్రబాబుకు చెప్పాలని కోరారు. ఒకవేళ మీరు మాట్లాడలేకుంటే తానే నేరుగా వచ్చి సీఎంతో మాట్లాడుతానని సుజనా, సీఎం రమేష్‌తో లగడపాటి చెప్పారు. శుక్రవారం ప్రభుత్వం కూల్చిన వైఎస్ విగ్రహాన్ని 2009లో లగడపాటి తన సొంత డబ్బులో […]

Advertisement
Update: 2016-07-31 05:01 GMT

విజయవాడలో వైఎస్ విగ్రహం కూల్చివేతపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ విగ్రహాన్ని కూల్చివేయడం సరైన చర్య కాదన్నారు. ఈ విషయంపై కేంద్రమంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్‌లకు లగడపాటి ఫోన్ చేశారు. వెంటనే విగ్రహాన్ని పునర్‌ప్రతిష్టించేలా చంద్రబాబుకు చెప్పాలని కోరారు. ఒకవేళ మీరు మాట్లాడలేకుంటే తానే నేరుగా వచ్చి సీఎంతో మాట్లాడుతానని సుజనా, సీఎం రమేష్‌తో లగడపాటి చెప్పారు.

శుక్రవారం ప్రభుత్వం కూల్చిన వైఎస్ విగ్రహాన్ని 2009లో లగడపాటి తన సొంత డబ్బులో ఏర్పాటు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వైఎస్ చూపిన చొరవకు గుర్తుగా పోలవరం ప్రాజెక్ట్ డిజైన్‌పై వైఎస్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే దీన్ని శుక్రవారం రాత్రికి రాత్రే చంద్రబాబు కూల్చివేయించారు. పైగా విగ్రహాలు కావాలంటే ఇళ్లలో పెట్టుకోండి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News