ఎస్పీవై రెడ్డి కూతురిపై హత్య కేసు నమోదు

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూతురు సుజలపై హత్య కేసు నమోదైంది. నంది పైపుల అనుబంధ సంస్థ అయిన నంది అకాడమీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పీఆర్‌వో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటనలో సుజలతో పాటు స్కూల్‌ సిబ్బంది షఫీ, మురళీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్టు నంద్యాల సీఐ మురళీధర్‌ రెడ్డి చెప్పారు. నంది అకాడమీ స్కూల్లో పీఆర్‌ఓగా పనిచేస్తున్న సుమంత్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అతడిని ఇటీవల స్కూల్ యాజమాన్యం నిర్బంధించింది. సుమంత్ […]

Advertisement
Update: 2016-07-30 08:11 GMT

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కూతురు సుజలపై హత్య కేసు నమోదైంది. నంది పైపుల అనుబంధ సంస్థ అయిన నంది అకాడమీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పీఆర్‌వో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటనలో సుజలతో పాటు స్కూల్‌ సిబ్బంది షఫీ, మురళీపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్టు నంద్యాల సీఐ మురళీధర్‌ రెడ్డి చెప్పారు.

నంది అకాడమీ స్కూల్లో పీఆర్‌ఓగా పనిచేస్తున్న సుమంత్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ అతడిని ఇటీవల స్కూల్ యాజమాన్యం నిర్బంధించింది. సుమంత్ సోదరుడు వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలోనే శుక్రవారం తెల్లవారుజామున స్కూల్ యాజమాన్యం నుంచి సుమంత్‌ సోదరుడికి ఫోన్ కాల్ వచ్చింది. సుమంత్‌ అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రిలో చేర్చామని సమాచారం ఇచ్చారు. సుమంత్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే సుమంత్‌ చనిపోయి ఉన్నాడు. ఒంటిపై గాయాలు కూడా ఉండడంతో కొట్టి చంపారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎంపీ కూతురు సుజలతో పాటు స్కూల్‌ సిబ్బంది మురళీ, షఫీపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ఎన్నికలు ముగియగానే టీడీపీలోకి ఫిరాయించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News