ఒంగోలు వైసీపీ అభ్యర్థి రేసులో శమంతకమణి

ఇదివరకు వాయిదాపడిన పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలునిర్వహిస్తామని ఇటీవల మంత్రులు ప్రకటించారు. దీంతో అప్పుడే ఆయా కార్పొరేషన్లలో పోటీకి పలువురు సిద్ధపడుతున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా డి. శమంతకమణి పేరు వినిపిస్తోంది. ఒంగోలుకు చెందిన ఈమె మద్రాసులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈమె కార్యక్రమాలకు మాజీ […]

Advertisement
Update: 2016-07-24 03:35 GMT

ఇదివరకు వాయిదాపడిన పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలునిర్వహిస్తామని ఇటీవల మంత్రులు ప్రకటించారు. దీంతో అప్పుడే ఆయా కార్పొరేషన్లలో పోటీకి పలువురు సిద్ధపడుతున్నారు. ఒంగోలు నగర కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ వైసీపీ మేయర్‌ అభ్యర్థిగా డి. శమంతకమణి పేరు వినిపిస్తోంది. ఒంగోలుకు చెందిన ఈమె మద్రాసులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈమె కార్యక్రమాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కూడా హాజరవుతుంటారు. ఆర్థికంగానూ శమంతకమణి కుటుంబం బలంగానే ఉందని చెబుతున్నారు. రిజర్వేషన్లలో ఒంగోలు నగర కార్పొరేషన్‌ మేయర్ స్థానం ఎస్పీలకు రిజర్వ్‌ కావడంతో శమంతకమణి పేరు బలంగా వినిపిస్తోంది. విద్యావంతురాలైన శమంతకమణిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే మంచి ఫలితమే ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఆదేశిస్తే తాను మేయర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్దమని కూడా శమంతకమణి చెబుతున్నారు. ఇప్పటికే గడపగడపకు వైసీపీ కార్యక్రమంలోనూ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటేయాల్సిందిగా వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News