తమిళ ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా చెర్రీ

టాలీవుడ్ లో ఏదైనా ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరవ్వడం కామన్. అదే పొరుగు రాష్ట్రంలో ఓ సినిమా ఫంక్షన్ కు చెర్రీ ప్రత్యేక అతిథిగా హాజరైతే… కచ్చితంగా అది హాట్ న్యూసే. అవును… తమిళనాట ఓ భారీ సినిమా ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ “ఇరుముగమ్” అనే సైన్స్-ఫిక్షన్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సినిమా తెలుగులో “ఇంకొక్కడు” పేరుతో కూడా […]

Advertisement
Update: 2016-07-24 03:53 GMT

టాలీవుడ్ లో ఏదైనా ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరవ్వడం కామన్. అదే పొరుగు రాష్ట్రంలో ఓ సినిమా ఫంక్షన్ కు చెర్రీ ప్రత్యేక అతిథిగా హాజరైతే… కచ్చితంగా అది హాట్ న్యూసే. అవును… తమిళనాట ఓ భారీ సినిమా ఆడియో ఫంక్షన్ కు రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ “ఇరుముగమ్” అనే సైన్స్-ఫిక్షన్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సినిమా తెలుగులో “ఇంకొక్కడు” పేరుతో కూడా విడుదలకానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కే రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నాడు.

ఆగస్ట్ 2న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరుగుతుంది. విక్రమ్ తో పాటు చెర్రీ ఈ ఫంక్షన్ కు స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతున్నాడు. ప్రస్తుతం చెర్రీ ధ్రువ అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ్ లో హిట్టయిన సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. ఇప్పుడు మరో సినిమా ఫంక్షన్ కు చెర్రీ హాజరవుతుండడంతో… విక్రమ్ కొత్త సినిమా రీమేక్ లో కూడా చెర్రీ నటింటే అవకాశం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ తాజా సమాచారం ప్రకారం, నిర్మాత అల్లు అరవింద్… తెలుగులో ఇంకొక్కడు రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చెర్రీని చెన్నైకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News