నాకు నీవు మాత్రమే కావాలి దిగ్విజయ్...

లేటు వయసులో ఘాటు ప్రేమతో వివాహం చేసుకున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తన ఆస్తులన్నీ కుమారుడికి రాసిచ్చేశారు. ఇకపై తన ఆస్తిలో పైసా కూడా రెండో భార్య అమృతరాయ్‌కి ఉండదని చెప్పారు. ఆస్తులన్నీకొడుకు పేర రాసేశానని ట్వీట్టర్‌లో ప్రకటించారు. అది కూడా తనభార్య అమృతా రాయ్ కోరిక మేరకే అలాచేశానని చెప్పారు. తన కోసం అమృతరాయ్‌ ఆస్తులపై హక్కులన్నింటినీ త్యాగం చేసిందని ప్రశంసించారు. జాతీయ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల అమృతారాయ్‌ని గతేడాది 67 ఏళ్ల వయసులో దిగ్విజయ్ […]

Advertisement
Update: 2016-07-14 07:28 GMT

లేటు వయసులో ఘాటు ప్రేమతో వివాహం చేసుకున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తన ఆస్తులన్నీ కుమారుడికి రాసిచ్చేశారు. ఇకపై తన ఆస్తిలో పైసా కూడా రెండో భార్య అమృతరాయ్‌కి ఉండదని చెప్పారు. ఆస్తులన్నీకొడుకు పేర రాసేశానని ట్వీట్టర్‌లో ప్రకటించారు. అది కూడా తనభార్య అమృతా రాయ్ కోరిక మేరకే అలాచేశానని చెప్పారు. తన కోసం అమృతరాయ్‌ ఆస్తులపై హక్కులన్నింటినీ త్యాగం చేసిందని ప్రశంసించారు.

జాతీయ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న 43 ఏళ్ల అమృతారాయ్‌ని గతేడాది 67 ఏళ్ల వయసులో దిగ్విజయ్ వివాహం చేసుకున్నారు. 67 ఏళ్ల వయసులో దిగ్విజయ్ వివాహం అప్పట్లో సంచలనం సృష్టించింది. దిగ్విజయ్‌, అమృతా వివాహంపై సోషల్‌ మీడియాలో పెద్దెత్తున జోకులు పేలాయి. అమృతారాయ్ తో దిగ్విజయ్‌ అతి చనువుగా ఉన్న ఫొటోలు గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అమృతారాయ్‌కు తన ఆస్తిలో ఏమీ దక్కబోదని కూడా దిగ్విజయ్ ట్విటర్ ద్వారా చెప్పారు. అటు అమృతా రాయ్ కూడా తనకు దిగ్విజయ్ కావాలి తప్ప ఆయన ఆస్తి కాదని ప్రకటించారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News