సోమిరెడ్డికి ప్రస్ట్రేషన్ వచ్చిందా?

ప్రత్యర్థులను ఏమీ చేయలేకపోతున్నామే అన్న ప్రస్ట్రేషన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆ స్థాయికి చేరినట్టుగా కనబడుతున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. జగన్‌ను ప్రసంగాలను నిషేధించాలని అనేది ఆయన డిమాండ్. ఆ డిమాండ్‌ మాట వరుసకు అన్నది కాదు. దీనిపై ఏకంగా ప్రసారభారతికి లేఖ రాస్తానంటున్నారు సోమిరెడ్డి. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రసంగాలను ప్రసారం […]

Advertisement
Update: 2016-07-09 01:47 GMT

ప్రత్యర్థులను ఏమీ చేయలేకపోతున్నామే అన్న ప్రస్ట్రేషన్ వచ్చినప్పుడే రాజకీయ నాయకులు విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేతలు కూడా ఆ స్థాయికి చేరినట్టుగా కనబడుతున్నారు. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. జగన్‌ను ప్రసంగాలను నిషేధించాలని అనేది ఆయన డిమాండ్. ఆ డిమాండ్‌ మాట వరుసకు అన్నది కాదు. దీనిపై ఏకంగా ప్రసారభారతికి లేఖ రాస్తానంటున్నారు సోమిరెడ్డి. కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రసంగాలను ప్రసారం చేయడం సరికాదని… అందుకే వాటిని నిషేధించాలని డిమాండ్ చేశారు. కేసుల్లో ఉన్న వ్యక్తులకు చట్టసభల్లో ఓటు హక్కు లేకుండా చేయాలని సోమిరెడ్డి రాజకీయ విలువల కోసం సూచన చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన‌ కేసులను ఏడాదిలోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే కేసులు ఉన్న వారి ప్రసంగాలను నిషేధించాల్సి వస్తే తెలంగాణలో ఓటుకు నోటు రేవంత్ రెడ్డి గొంతును మొదట కట్ చేయాల్సి ఉంటుంది. రేవంత్‌తో పాటు మిగిలిన ఒక్క టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వాయిస్ కూడా వినిపించదు. ఎంపీల కేసులను ఏడాదిలో పరిష్కరిస్తే టీడీపీకే చెందిన మరో ఎంపీ ఆర్థిక నేరాల్లో కూరుకుపోయిన సుజనా చౌదరి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కోర్టులు స్టేలు ఎత్తివేసి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చంద్రబాబు పరిస్థితి కూడా ఏంటో ఆలోచించుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రిమినల్ ప్రజాప్రతినిధుల జాబితాలో టీడీపీయే ముందున్న విషయం కూడా ప్రపంచానికి తెలుసు. తన మీద కేసులు లేవుకదాని సోమిరెడ్డి ఇలాంటి డిమాండ్లు చేస్తే తోటి టీడీపీ నేతలు ఏమైపోవాలో.

click on image to read-

Tags:    
Advertisement

Similar News