గరికపాటి ఫైర్ అయింది వీరిపైనేనా?

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినిమా వాళ్లు ప్రకటనల్లో నటిస్తూ సమాజానికి తీరని హానీ చేస్తున్నారని విమర్శించారు. జీవితంలో ఒక రోజు కూడా వంట చేయని రిటైర్డ్‌ నటీమణి కూడా వచ్చి ఫలాన బియ్యం బాగుంటాయని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జీవితంలో భూమితో సంబంధం లేని ఒక దర్శకుడు, ఒక గాయకుడు వచ్చి ఏలాంటి భూమి కొనాలో చెబుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే భూముల ధరలు […]

Advertisement
Update: 2016-07-06 09:10 GMT

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సినిమా వాళ్లు ప్రకటనల్లో నటిస్తూ సమాజానికి తీరని హానీ చేస్తున్నారని విమర్శించారు. జీవితంలో ఒక రోజు కూడా వంట చేయని రిటైర్డ్‌ నటీమణి కూడా వచ్చి ఫలాన బియ్యం బాగుంటాయని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జీవితంలో భూమితో సంబంధం లేని ఒక దర్శకుడు, ఒక గాయకుడు వచ్చి ఏలాంటి భూమి కొనాలో చెబుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్లే భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని గరికపాటి ఆవేదన చెందారు.

ఇలాంటి పనులు చేస్తూ ధర్మం గురించి పాటలుపాడే, ధర్మం గురించి సినిమాలు తీసే హక్కు ఎక్కడుంటుందని ప్రశ్నించారు. 90ఏళ్లు వచ్చినా డబ్బు కాంక్ష చావదా అని మండిపడ్డారు. లక్షలు లక్షలు తీసుకుని ఇది ప్రజలను మోసం చేయడమేనని గరికపాటి అభిప్రాయపడ్డారు. 80 ఏళ్లు వచ్చినా డబ్బుకాంక్ష చావని వాళ్లు కూడా దేవుడి గురించి సినిమాలు తీయడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. భూమి గురించి తెలియని ఒక దర్శకుడు, ఒక గాయకుడు…. భూముల గురించి చెప్పడం ఏమిటని గరికపాటి విమర్శించడం బట్టి వారిద్దరూ సింగర్ బాలసుబ్రమణ్యం, కె. విశ్వనాథ్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్‌ ప్రకటనల్లో నటిస్తున్నారు. ఇక్కడ భూమి కొంటే స్వర్గమేనన్నట్టుగా చెబుతుంటారు. బహుశా గరికపాటి విమర్శించింది కె. విశ్వనాథ్, బాలసుబ్రమణ్యంలనే అయి ఉంటుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News