జగన్‌ ఫొటోలపై ఆ ఛానల్‌ ఏం చెప్పిందంటే..!

వైఎస్‌ జగన్‌ ఏం చేసినా అది మీడియాకు హాట్ న్యూసే అవుతోంది. గతంలో ఒకసారి ఇంగ్లండ్ వెళ్లిన సమయంలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న జగన్ ఫొటో గతేడాది పెద్దెత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చాలా మంది నేతలు విదేశాలకు వెళ్తున్నా ఎందుకనో గానీ జగన్‌ ఫొటోలకే క్రేజ్ విపరీతంగా ఉంటోంది. తాజాగా 10 రోజుల ఫారిన్ టూర్ వెళ్లిన జగన్‌ అక్కడ గోల్ఫ్‌ అడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫొటోలను చూసి జగన్‌ […]

Advertisement
Update: 2016-06-23 06:31 GMT

వైఎస్‌ జగన్‌ ఏం చేసినా అది మీడియాకు హాట్ న్యూసే అవుతోంది. గతంలో ఒకసారి ఇంగ్లండ్ వెళ్లిన సమయంలో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న జగన్ ఫొటో గతేడాది పెద్దెత్తున సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. చాలా మంది నేతలు విదేశాలకు వెళ్తున్నా ఎందుకనో గానీ జగన్‌ ఫొటోలకే క్రేజ్ విపరీతంగా ఉంటోంది. తాజాగా 10 రోజుల ఫారిన్ టూర్ వెళ్లిన జగన్‌ అక్కడ గోల్ఫ్‌ అడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి.

ఇప్పుడు ఈ ఫొటోలను చూసి జగన్‌ అభిమానులు మురిసిపోతున్నారు. ఆయన ప్రత్యర్థి మీడియా కూడా జగన్‌ ఫొటోలపై కథనాలు ప్రసారం చేయడం విశేషం. జగన్‌ను విమర్శించడంలో ముందుండే సదరు ఛానల్ కూడా జగన్ ఫొటోలపై స్పందించింది. విదేశాల్లో జగన్ ఆటవిడుపు బాగానే సాగుతున్నట్టుగా ఉందని వ్యాఖ్యానించింది. ఈడెన్ బర్గ్‌లో జగన్‌ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు తమకు ప్రత్యేకంగా చిక్కాయని చెప్పింది.

జగన్ రాక కోసం పార్టీ నేతలంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారని.. ఈ సమయంలో జగన్‌ ఇలా గోల్ఫ్ ఆడుతూ కనిపించడంపై పార్టీలో పెద్దెత్తున చర్చ జరుగుతోందని చెప్పింది. జగన్ బ్రిటన్, స్కాట్లాండ్లో పర్యటిస్తున్నారని సదరు ఛానల్ వెల్లడించింది. మొత్తం మీద జగన్‌ను వ్యతిరేకించే మీడియా కూడా ఆయన పర్యటనపై ఆచితూచే స్పందిస్తున్నాయి. జగన్ గోల్ఫ్ ఆడడంపై టీడీపీ నేతలు కూడా స్పందించేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ ఫోటోలను అందరూ బాగానే వాడేస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News