వైఎస్ ఎంతో పుణ్యం చేసుకున్నారు... అందుకే తప్పించుకున్నారు

వైఎస్ అండతో నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఎదిగిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఆయన కుటుంబంపై ఎంతటి విమర్శలు చేసేందుకైనా వెనుకాడడం లేదు. చంద్రబాబు వద్ద మెప్పుపొందేందుకో ఏమో గానీ ఆనం వివేకానందరెడ్డి ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వివేకా…  జగన్‌కు కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు అన్న సెంటిమెంట్ లేదంటూ జగన్ వ్యక్తిత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. జగన్‌ మానసిక వ్యాధిలో బాధపడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. సీఎం కాకముందే లక్ష కోట్లు దోచుకున్న జగన్‌ స్వయంగా […]

Advertisement
Update: 2016-06-17 04:32 GMT

వైఎస్ అండతో నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఎదిగిన ఆనం బ్రదర్స్ ఇప్పుడు ఆయన కుటుంబంపై ఎంతటి విమర్శలు చేసేందుకైనా వెనుకాడడం లేదు. చంద్రబాబు వద్ద మెప్పుపొందేందుకో ఏమో గానీ ఆనం వివేకానందరెడ్డి ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన వివేకా… జగన్‌కు కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు అన్న సెంటిమెంట్ లేదంటూ జగన్ వ్యక్తిత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు.

జగన్‌ మానసిక వ్యాధిలో బాధపడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. సీఎం కాకముందే లక్ష కోట్లు దోచుకున్న జగన్‌ స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఇక ఎన్ని కోట్లు దోచుకుంటారో అని అన్నారు. వైఎస్ ఎంతో పుణ్యం చేసుకున్నారని అందుకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారన్నారు. ఒకవేళ బతికి వుంటే ఆయన చేత రాజీనామా చేయించి పదవిని జగన్‌ లాక్కునేవారన్నారు. చనిపోవడం ద్వారా జగన్ వేధింపుల నుంచి వైఎస్ తప్పించుకున్నారని అన్నారు.

వైఎస్ ఉన్నన్ని రోజులు ఆయన సతీమణిని విజయమ్మ అని సంబోధించిన ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు ఆమెను విజయలక్ష్మి అని సంబోధించారు. విజయలక్ష్మిని విశాఖలో నిలబెట్టి సొంత తల్లిని బలిపశువు చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. విజయమ్మ… చంద్రబాబు, రామోజీరావు తదితరుల ఆస్తులపై గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి చంద్రబాబు అనుకూల మీడియా విజయమ్మకు బదులు విజయలక్ష్మి అని రాస్తుంటారు. టీడీపీ నేతలు కూడా అలాగే పిలవడం మొదలుపెట్టారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News