రామ్మూర్తినాయుడికి పిచ్చిపట్టించిన ఉన్మాది చంద్రబాబు

చంద్రబాబు తనరాజకీయ చిత్రం మొదటి రీల్‌లోనే ఎన్టీఆర్‌ను గద్దె దించి, చంపేసి విలన్‌గా అవతారం ఎత్తారని వైసీపీనేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. జగన్‌పై మంత్రి ఉమ చేసిన ఆరోపణలను భూమన ఖండించారు. పులివెందుల చీనిచెట్లకు నీరిచ్చానని చెబుతున్న దేవినేని ఉమ… ఈ రెండేళ్లలో కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టి పులివెందులకు నీరిచ్చావా అని ప్రశ్నించారు. వేమన చెప్పినట్టు ప్రభువు కోతి అయితే మిగిలిన నేతలు ఇలాగే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఉన్మాదం ఉన్నది జగన్ లో […]

Advertisement
Update: 2016-06-15 05:35 GMT

చంద్రబాబు తనరాజకీయ చిత్రం మొదటి రీల్‌లోనే ఎన్టీఆర్‌ను గద్దె దించి, చంపేసి విలన్‌గా అవతారం ఎత్తారని వైసీపీనేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. జగన్‌పై మంత్రి ఉమ చేసిన ఆరోపణలను భూమన ఖండించారు. పులివెందుల చీనిచెట్లకు నీరిచ్చానని చెబుతున్న దేవినేని ఉమ… ఈ రెండేళ్లలో కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు కట్టి పులివెందులకు నీరిచ్చావా అని ప్రశ్నించారు. వేమన చెప్పినట్టు ప్రభువు కోతి అయితే మిగిలిన నేతలు ఇలాగే మాట్లాడుతారని ఎద్దేవా చేశారు.

ఉన్మాదం ఉన్నది జగన్ లో కాదని చంద్రబాబు కుటుంబంలోనే ఉందని భూమన అన్నారు. సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడికే పిచ్చిపట్టించిన ఉన్మాది చంద్రబాబు అని విమర్శించారు. సంకల్ప దీక్ష చేయాల్సింది జనం కాదని… అవినీతి అక్రమాలకు పాల్పడబోమని చంద్రబాబు, ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు వ్యక్తులు సంకల్పం చేయాలని సూచించారు. తాము అమ్ముడుపోలేదని జ్యోతుల నెహ్రు చెప్పడానని భూమన ఎద్దేవా చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలుచేసి ఎన్నికలకు సిద్ధమైతే అప్పుడు తాము చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకుంటామని భూమన సవాల్ విసిరారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News