"నాకూ సిగ్గుంది... వద్దు జగన్"- జ్యోతుల

తాము చంద్రబాబుకు అమ్ముడుపోయామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తీవ్రంగా స్పందించారు. తాను అమ్ముడుపోయినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తనను కొనేందుకు ఎవరూ సరిపోరని జ్యోతుల చెప్పారు. గతంలో జగన్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50లక్షలు, కోటి రూపాయలు జగన్‌ ఇచ్చారని ఆరోపించారు. అందుకు సాక్ష్యాలు కూడా తనదగ్గర ఉన్నాయన్నారు. అవినీతి గురించి జగన్ ఎంత తక్కువ […]

Advertisement
Update: 2016-06-14 10:39 GMT

తాము చంద్రబాబుకు అమ్ముడుపోయామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఫిరాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు తీవ్రంగా స్పందించారు. తాను అమ్ముడుపోయినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తనను కొనేందుకు ఎవరూ సరిపోరని జ్యోతుల చెప్పారు. గతంలో జగన్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో చెప్పాలన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50లక్షలు, కోటి రూపాయలు జగన్‌ ఇచ్చారని ఆరోపించారు. అందుకు సాక్ష్యాలు కూడా తనదగ్గర ఉన్నాయన్నారు.

అవినీతి గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. తనకూ సిగ్గుందని నిన్నటి వరకు జగన్‌ వెంట తిరిగాను కాబట్టి సిగ్గువిడిచి జగన్‌ అవినీతి గురించి మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. రాజకీయంగా జగన్ చాలా దిగజారిపోయారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ ఒక్క సూచనైనా చేసినట్టు చూపిస్తే రాజకీయాల నుంచితప్పుకుంటానని జ్యోతుల చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News