అంతలేదు... మీకు నేను చాలు!- అవినాష్ సవాల్

40 ఏళ్లుగా కడప జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబానికి బ్రహ్మరథం పడుతున్నా వారు చేసింది మాత్రం ఏమీ లేదని టీడీపీనేత, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి విమర్శించారు. పులివెందుల నియోజకవర్గంలో ఎండుతున్న చీని చెట్లకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అభివృద్దిపై చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌తో బహిరంగచర్చ జరిపేంత స్థాయి సతీష్ రెడ్డికి లేదన్నారు. సతీష్ రెడ్డికి దమ్ముంటే […]

Advertisement
Update: 2016-06-08 02:20 GMT

40 ఏళ్లుగా కడప జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబానికి బ్రహ్మరథం పడుతున్నా వారు చేసింది మాత్రం ఏమీ లేదని టీడీపీనేత, మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి విమర్శించారు. పులివెందుల నియోజకవర్గంలో ఎండుతున్న చీని చెట్లకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అభివృద్దిపై చర్చకు రావాలని జగన్‌కు సవాల్ విసిరారు. ఈనేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్‌తో బహిరంగచర్చ జరిపేంత స్థాయి సతీష్ రెడ్డికి లేదన్నారు. సతీష్ రెడ్డికి దమ్ముంటే చంద్రబాబు అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. పులివెందుల వేదికగా చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు మోసాలపై ఎంపీ అవినాష్, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News