పెగ్గేయండి....పేకాట ఆడండి- మరోసారి సీఎం దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్యలు చేశారు. హ్యాపీగా ఉండేందుకు వ్యసనాలకు బానిసలు కావాలని సూచించారు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఒక పెగ్గు వేయాలని సూచించారు. తాగి భార్యపిల్లలను మాత్రం కొట్టవద్దన్నారు. అంతేకాదు పేకాట ఆడాల్సిందిగా జనానికి సూచించారు. హ్యాపీగా ఉండాలంటే రోజు సాయంత్రం పేకాట ఆడుకోవాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలకు అంతా షాక్ అయ్యారు. ఒక తండ్రిలాంటి సీఎం ప్రజలను వ్యసనాల నుంచి బయటపడేయాల్సిందిపోయి మందుకొట్టండి, పేకాట ఆడండి అనిచెప్పడం ఆశ్చర్యకరమే. విజయవాడలో […]

Advertisement
Update: 2016-06-05 02:00 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి దిగ్భ్రాంతి కలిగించే వ్యాఖ్యలు చేశారు. హ్యాపీగా ఉండేందుకు వ్యసనాలకు బానిసలు కావాలని సూచించారు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే ఒక పెగ్గు వేయాలని సూచించారు. తాగి భార్యపిల్లలను మాత్రం కొట్టవద్దన్నారు. అంతేకాదు పేకాట ఆడాల్సిందిగా జనానికి సూచించారు. హ్యాపీగా ఉండాలంటే రోజు సాయంత్రం పేకాట ఆడుకోవాలని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలకు అంతా షాక్ అయ్యారు. ఒక తండ్రిలాంటి సీఎం ప్రజలను వ్యసనాల నుంచి బయటపడేయాల్సిందిపోయి మందుకొట్టండి, పేకాట ఆడండి అనిచెప్పడం ఆశ్చర్యకరమే. విజయవాడలో జరిగినకార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

శనివారం కూడా చంద్రబాబు ఈ తరహాలోనే విచిత్రమైన కామెంట్స్ చేశారు. సత్యనాదెండ్ల మైక్రోసాప్ట్ సీఈవో అయ్యారంటే అందుకు తానే కారణమనిచెప్పారు. తానిచ్చిన ప్రేరణతోనే సత్యనాదెండ్ల మైక్రోసాప్ట్ సీఈవో అయ్యారని చెప్పుకొచ్చారు. జనాభా తగ్గుతోందని కాబట్టి భవిష్యత్తులో మీటింగ్‌లకు రోబోలను తీసుకురావాల్సి ఉంటుందని, కాబట్టి ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News