రైలు మిస్సయిందని... ఆమెకోసం ప్రత్యేక రైలు వేశారు

బీజేపీ నాయకుడు స్వర్గీయ ప్రమోద్‌ మహాజన్‌ కూతురు పూనం మహాజన్‌. ఇప్పుడు ఆమె బీజేపీ ఎంపీ. ఆమె మధ్యప్రదేశ్‌లోని బీనా జిల్లాకు వెళ్లింది. అక్కడినుంచి రైలులో బయలుదేరి భూపాల్‌ వెళ్లి అక్కడినుంచి విమానంలో ముంబయి చేరుకోవాల్సివుంది. అయితే ఆమె ఆలస్యంగా స్టేషన్‌కు రావడంవల్ల భూపాల్‌ వెళ్లే రైలు మిస్సయింది. దాంతో ఆమెకోసం ప్రత్యేకంగా రైల్వే అధికారులు వెంటనే రెండు బోగీలతో ప్రత్యేక రైలును భూపాల్‌వరకు ఏర్పాటుచేశారు. షెడ్యూల్‌లో లేని ఈ రైలు నడపడంవల్ల మార్గం మధ్యంలో మామూలుగా […]

Advertisement
Update: 2016-06-03 04:35 GMT

బీజేపీ నాయకుడు స్వర్గీయ ప్రమోద్‌ మహాజన్‌ కూతురు పూనం మహాజన్‌. ఇప్పుడు ఆమె బీజేపీ ఎంపీ. ఆమె మధ్యప్రదేశ్‌లోని బీనా జిల్లాకు వెళ్లింది. అక్కడినుంచి రైలులో బయలుదేరి భూపాల్‌ వెళ్లి అక్కడినుంచి విమానంలో ముంబయి చేరుకోవాల్సివుంది. అయితే ఆమె ఆలస్యంగా స్టేషన్‌కు రావడంవల్ల భూపాల్‌ వెళ్లే రైలు మిస్సయింది. దాంతో ఆమెకోసం ప్రత్యేకంగా రైల్వే అధికారులు వెంటనే రెండు బోగీలతో ప్రత్యేక రైలును భూపాల్‌వరకు ఏర్పాటుచేశారు. షెడ్యూల్‌లో లేని ఈ రైలు నడపడంవల్ల మార్గం మధ్యంలో మామూలుగా వెళ్లాల్సిన అనేక రైళ్లకు అంతరాయం ఏర్పడింది. అయితేనేమి? ఆమె మాత్రం సమయానికి భూపాల్‌ చేరుకొని వెంటనే విమానాశ్రయానికి వెళ్లి విమానంలో ఢిల్లీ చేరుకుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News