జగన్ నా మేనల్లుడు... జగన్ దోషమే లేదు

వైఎస్ఆర్‌ ప్రాణస్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. జగన్‌ను అవినీతిపరుడు అనడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. జగన్ తప్పు చేశాడా లేదా అన్నది ఇప్పుడు కోర్టులు తేలుస్తాయని దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జగన్‌ దోషం ఉండే అవకాశమే లేదన్నారు. 2004 నుంచి 2009 వరకు జరిగిన వ్యవహారాల్లో తాను కూడా భాగస్వామినేనని వాటికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ […]

Advertisement
Update: 2016-05-29 18:03 GMT

వైఎస్ఆర్‌ ప్రాణస్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. జగన్‌ను అవినీతిపరుడు అనడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. జగన్ తప్పు చేశాడా లేదా అన్నది ఇప్పుడు కోర్టులు తేలుస్తాయని దీనిపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం జగన్‌ దోషం ఉండే అవకాశమే లేదన్నారు. 2004 నుంచి 2009 వరకు జరిగిన వ్యవహారాల్లో తాను కూడా భాగస్వామినేనని వాటికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కానీ రాష్ట్ర విభజన జరిగింది 2009 తర్వాత అన్న విషయం కూడా గుర్తించుకోవాలన్నారు. జగన్ తన మేనల్లుడు అని కేవీపీ చెప్పారు. జగన్‌తో మీరు ఎందుకు లేరు అని ప్రశ్నించగా… రాష్ట్రానికి అవసరమైన విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News