పెళ్లి చేయలేదని…తల్లిని తగలబెట్టాడు!
చెన్నైలోని అరుంబాక్కంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తనకో అమ్మాయిని చూసి పెళ్లి చేయడంలేదనే కోపంతో అమరనాథ్ ప్రసాద్ (40) అనే వ్యక్తి తల్లిని దారుణంగా హతమార్చాడు. పోలీసులు ప్రసాద్ని అరెస్టు చేసి విచారించగా, తనకు పెళ్లి చేయటం లేదనే కోపంతోనే ఈ పనిచేశానని ఒప్పుకున్నాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రసాద్ తాగుబోతని, రాత్రులు తాగివచ్చి అనారోగ్యంతో ఉన్న తల్లి శశికళతో గొడవ పడుతుండేవాడని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం కాలికి గాయమైన శశికళ నడవలేని […]
చెన్నైలోని అరుంబాక్కంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తనకో అమ్మాయిని చూసి పెళ్లి చేయడంలేదనే కోపంతో అమరనాథ్ ప్రసాద్ (40) అనే వ్యక్తి తల్లిని దారుణంగా హతమార్చాడు. పోలీసులు ప్రసాద్ని అరెస్టు చేసి విచారించగా, తనకు పెళ్లి చేయటం లేదనే కోపంతోనే ఈ పనిచేశానని ఒప్పుకున్నాడు. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రసాద్ తాగుబోతని, రాత్రులు తాగివచ్చి అనారోగ్యంతో ఉన్న తల్లి శశికళతో గొడవ పడుతుండేవాడని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం కాలికి గాయమైన శశికళ నడవలేని స్థితిలో మంచంలోనే ఉండగా, ప్రసాద్ తనకు పెళ్లి చేయమంటూ గొడవ పడుతుండేవాడు. ఆదివారం అర్థరాత్రి దాటాక తల్లిని నానా దుర్బాషలు ఆడటంతో పాటు ఆమెని కుర్చీకి కట్టేసి ఇంటికి నిప్పుపెట్టాడు. శశికళ కేకలకు ఇరుగుపొరుగు వారు వచ్చి, ఆమెని ఇంట్లోంచి బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే 70శాతం వరకు శరీరం కాలిపోవడంతో శశికళ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందింది.
పోలీసులు ఆమె వద్ద మరణవాంగ్మూలం తీసుకున్నారు. తన కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె చెప్పడంతో పోలీసులు ప్రసాద్ని అరెస్టు చేశారు. శశికళ… కొడుకు, అవివాహిత అయిన తన సోదరితో కలిసి ఉండేవారని పోలీసులు వెల్లడించారు.