జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన మైసూరా రెడ్డి

సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మైసూరారెడ్డి… జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది అపరిచితుడి క్యారెక్టర్ అని అన్నారు. జగన్‌ మాట మీద నిలకడ లేని వ్యక్తి అని అన్నారు.  అంతర్గత ప్రజాస్వామ్యం వైసీపీలో లేదన్నారు. చెప్పిన సలహాలను కూడా జగన్ వినడం లేదన్నారు. గోళ్లు గిల్లుకుంటూ అక్కడ ఖాళీగా కూర్చోవడం ఎందుకనే రాజీనామా చేసినట్టు చెప్పారు. అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం […]

Advertisement
Update: 2016-04-26 23:30 GMT

సీనియర్ నేత మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మైసూరారెడ్డి… జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ది అపరిచితుడి క్యారెక్టర్ అని అన్నారు. జగన్‌ మాట మీద నిలకడ లేని వ్యక్తి అని అన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం వైసీపీలో లేదన్నారు. చెప్పిన సలహాలను కూడా జగన్ వినడం లేదన్నారు.

గోళ్లు గిల్లుకుంటూ అక్కడ ఖాళీగా కూర్చోవడం ఎందుకనే రాజీనామా చేసినట్టు చెప్పారు. అనుచరులతో చర్చించి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానన్నారు. రాజ్యసభ సీటు రాకపోవడం వల్లే రాజీనామా చేశారా అన్న ప్రశ్నకు సున్నితంగా సమాధానం ఇవ్వకుండా తిరస్కరించారు మైసూరా. జగన్‌కు అధికారంపై మాత్రమే ధ్యాస ఉందన్నారు. ప్రజాసమస్యలపై పోరాడే ఆలోచన జగన్‌కు లేదన్నారు. వైసీపీలోకి తాను చేరడమే ఒక యాక్సిడెంటల్‌గా జరిగిందన్నారు. తనపై పదేపదే పార్టీలు మారుతారన్న మచ్చ ఉందని అందుకు తాను బాధపడుతున్నానని చెప్పారు. తండ్రితో ఉన్న విబేధాలకు పిల్లలను ఎందుకు బాధ్యులను చేయడం అన్న ఉద్దేశంతోనే మానవీయ కోణంలో జగన్‌కు మద్దతుగా నిలిచానని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News