ఆయన అందలం ఎక్కించారు… ఈయన హ్యాండిస్తున్నారు

ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల జాతర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజులుగా పార్టీ మారడంపై తర్జనభర్జన పడుతున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎట్టకేలకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్టీ మారితే ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచడంతో బుడ్డా రాజశేఖర్  సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం సొంతూరులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగానే కాకుండా కర్నూలు జిల్లా […]

Advertisement
Update: 2016-04-24 02:52 GMT

ఏపీలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల జాతర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజులుగా పార్టీ మారడంపై తర్జనభర్జన పడుతున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎట్టకేలకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

పార్టీ మారితే ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచడంతో బుడ్డా రాజశేఖర్ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం సొంతూరులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగానే కాకుండా కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగానూ ఉన్నారు.. సీనియారిటీకి మించి ఆయనకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతుంటారు. శ్రీశైలం టికెట్ కోసం అప్పట్లో కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నించినా వారిని కాదని బుడ్డాకు జగన్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కూడా జగన్‌కు హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యారు. భూమాతో పాటుగానే బుడ్డా పార్టీ వీడుతారని ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ వార్తలను బుడ్డా తీవ్రంగా ఖండించారు. ప్రతి వ్యక్తికి ఒక రేటు ఉంటుంది… ఆ రేటుకు కొనగలిగితే బుట్టలో పడాల్సిందే అంటారు. బహుశా ఇదే కాబోలు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News